జీ కే చారిటబుల్ ట్రస్ట్ నుండి బాలిక వైద్యానికి ఆర్ధికసహాయం.

 జీ కే చారిటబుల్ ట్రస్ట్  నుండి   బాలిక వైద్యానికి ఆర్ధికసహాయం.


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం పట్టణంలోని పదవ వార్డ్ మారుతీనగర్ నందలి ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సేవాకార్యక్రమంలో  కొయ్యలగూడెం మండలం  దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన బండి సుబ్బారావు కుమార్తె బండి జ్ఞాన ఐశ్వర్య నాగదేవి (ఇషు ) వైద్యసేవల నిమిత్తం 7000 (ఏడు వేలు)రూపాయలు వితరణ అందించారు.
     వివరాల లోనికి వెళితే గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న బండి జ్ఞాన ఐశ్వర్య నాగదేవి గుండె శస్త్ర చికిత్సకు 8,50,000(ఎనిమిది లక్షల యాభైవేలు ) అవసరం కాగా దాతల తోడ్పాటు అవసరమని ఆదుకోమని తండ్రి ఇచ్చిన విజ్ఞప్తి తమ దృష్టికిరాగా జీకే చారిటబుల్ ట్రస్ట్ తమ వంతుగా దాతలు సోపిటి స్వామి,రొంగల దేవిప్రసాద్ ఇచ్చిన చెరో రెండువేలు, జీకే చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ వ్యక్తిగత వితరణ మూడువేలు వెరసి ఏడువేలు (7000) శుక్రవారం అందజేసినట్టు గణిత ఆనంద ప్రసాద్ తెలిపారు.
   జీ కే ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ మాట్లాడుతూ నిరాశ్రయుల సేవలో భాగంగా ట్రస్ట్ ద్వారా తమ వ్యక్తిగత మరియు  దాతల తోడ్పాటుతో వారి వద్దకే వెళ్లి నెలలో ఒకరోజు భోజనం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మరిన్ని సేవలు సమాజానికి ట్రస్ట్ ముందు ముందు చేపడుతుందని అన్నారు.
    కార్యక్రమంలో పదవ వార్డ్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, ఎస్. స్వామి, రొంగల దేవీప్రసాద్, భవిరిశెట్టి హనుమాన్ తిలక్, కే వీ రామారావు, జీ కే ట్రస్ట్ సభ్యురాలు ఈ.కనకలక్మి తదితరులు పాల్గొన్నారు