ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు.

ఘనంగా ఇందిరా నగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 09.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగో వార్డ్ ఇందిరానగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ అంగన్వాడి సెంటర్ నందు బేబీ రత్నం టీచర్  ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సభ్యులు వలవల మేరీ సుశీల షేక్ హసీనా సహకారంతో ముగ్గురు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం 
బాబుకి అన్నప్రాసన ఘనంగా నిర్వహించారు 
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా CPDO బ్యూలా మేడం 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ పాల్గొని మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ గర్భిణీ స్త్రీలు అందరికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు 
Cpdo బ్యూల మేడం మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది గర్భిణీ స్త్రీలకు తను శుభాకాంక్షలు తెలియజేశారు
టీచర్ బేబీ రత్నం ని 
బ్యూల మేడం కౌన్సిలర్ వలవల తాతాజీ సన్మానించారు 
ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ టీచర్ 
కొండ్రు సురేఖ ముప్పిడి కాంత స్కూల్ స్టాఫ్ నాగమణి ప్రగడ గంగమ్మ మరియు గర్భిణీ స్త్రీలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు